
దాదాపు తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుపోయిన భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ను తీసుకొచ్చేందుకు ముందడుగు పడింది. ఆమెను అంతరిక్షం నుంచి తిరిగి భూమి పైకి తీసుకొచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ క్రూ10 మిషన్ ను ప్రయోగించింది. ఈ రోజు (మార్చి 15) ఉదయం 4:35 గంటలకు ఫాల్కన్ 9 రాకెట్ కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ లో నలుగురు వ్యోమగాముల - అన్నే మెక్క్లెయిన్ ,నికోల్ అయర్స్, టకుయా ఒనిషి (జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ) , రోస్కోస్మోస్ వ్యోమగామి కిరిల్ పెస్కోవ్ ఉన్నారు. మార్చి 19 న విలియమ్స్ అంతరిక్షం నుంచి బయల్దేరనుంది. వీలైతే మరో వారం రోజుల్లో ఆమె భూమి మీదకు వచ్చే అవకాశం ఉంది.
2024 జూన్లో ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్, నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్ మిషన్ క్రూ 9 ప్రాజెక్ట్లో భాగంగా బోయింగ్ స్టార్లైనర్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. నాసా షెడ్యూల్ ప్రకారం స్పేస్లో వీరి పర్యటన వారం రోజులు. కానీ.. వీరు వెళ్లిన బోయింగ్ స్టార్లైనర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నిక్ హేగ్, అలెగ్జాండర్ తిరిగి భూమి పైకి రాగా.. సునీత, బచ్ విల్మోర్ అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు.
వీరిని తిరిగి భూమీ మీదకు తీసుకొచ్చేందుకు నాసా పలుమార్లు ప్రయత్నించగా.. ఆ ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. దీంతో సునీతా, బచ్ విల్మోర్ 9 నెలలుగా అంతరిక్షంలోనే ఉన్నారు. అప్పటి నుంచి భూమి పైకి వచ్చేందుకు వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ట్రంప్.. స్పేస్లో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్స్ సునీతా, విల్మోర్ను వెంటనే భూమిపైకి తీసుకురావాలని నాసా, ఎలన్ మస్క్ను ఆదేశించారు. దీంతో నాసా, మస్క్ స్పేస్ఎక్స్ క్రూ10 మిషన్ లాంఛ్ చేసింది.
Have a great time in space, y'all!
— NASA (@NASA) March 14, 2025
#Crew10 lifted off from @NASAKennedy at 7:03pm ET (2303 UTC) on Friday, March 14. pic.twitter.com/9Vf7VVeGev