నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్..సునీతా విలియమ్స్ భూమిపైకి వచ్చేది ఎప్పుడంటే?

నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్..సునీతా విలియమ్స్ భూమిపైకి వచ్చేది ఎప్పుడంటే?

దాదాపు తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుపోయిన భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్‌‎ను తీసుకొచ్చేందుకు ముందడుగు పడింది. ఆమెను అంతరిక్షం నుంచి తిరిగి భూమి పైకి తీసుకొచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్  క్రూ10 మిషన్ ను ప్రయోగించింది.   ఈ రోజు (మార్చి 15) ఉదయం 4:35 గంటలకు  ఫాల్కన్ 9 రాకెట్ కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లింది.  రాకెట్ లో నలుగురు వ్యోమగాముల - అన్నే మెక్‌క్లెయిన్ ,నికోల్ అయర్స్, టకుయా ఒనిషి  (జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ) , రోస్కోస్మోస్ వ్యోమగామి కిరిల్ పెస్కోవ్ ఉన్నారు. మార్చి 19 న విలియమ్స్ అంతరిక్షం నుంచి బయల్దేరనుంది. వీలైతే మరో వారం రోజుల్లో ఆమె భూమి మీదకు వచ్చే అవకాశం ఉంది.

2024 జూన్‎లో ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బచ్‌ విల్మోర్, నిక్‌ హేగ్, అలెగ్జాండర్‌ గోర్బునోవ్‌ మిషన్ క్రూ 9 ప్రాజెక్ట్‎లో భాగంగా బోయింగ్‌ స్టార్‌లైనర్‌ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. నాసా షెడ్యూల్ ప్రకారం స్పేస్‎లో వీరి పర్యటన వారం రోజులు. కానీ.. వీరు వెళ్లిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌‎లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నిక్‌ హేగ్, అలెగ్జాండర్‌ తిరిగి భూమి పైకి రాగా.. సునీత, బచ్‌ విల్మోర్ అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. 

వీరిని తిరిగి భూమీ మీదకు తీసుకొచ్చేందుకు నాసా పలుమార్లు ప్రయత్నించగా.. ఆ ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. దీంతో సునీతా, బచ్‌ విల్మోర్ 9 నెలలుగా అంతరిక్షంలోనే ఉన్నారు. అప్పటి నుంచి భూమి పైకి వచ్చేందుకు వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు  చేపట్టిన ట్రంప్.. స్పేస్‎లో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్స్ సునీతా, విల్మోర్‎ను వెంటనే భూమిపైకి తీసుకురావాలని నాసా, ఎలన్ మస్క్‎ను ఆదేశించారు. దీంతో నాసా, మస్క్ స్పేస్‎ఎక్స్ క్రూ10 మిషన్ లాంఛ్ చేసింది. 

Have a great time in space, y'all!
#Crew10 lifted off from @NASAKennedy at 7:03pm ET (2303 UTC) on Friday, March 14. pic.twitter.com/9Vf7VVeGev

— NASA (@NASA) March 14, 2025