ఎండీ హాఫీజ్​కు​ అసెంబ్లీ స్పీకర్ అభినందన

ఎండీ హాఫీజ్​కు​ అసెంబ్లీ స్పీకర్ అభినందన

వికారాబాద్, వెలుగు: హైదరాబాద్​లో ఇటీవల జరిగిన 7వ మాస్టర్ గేమ్స్ తెలంగాణ స్టేట్ చాంపియన్ షిప్- 2025 జావెలిన్ త్రో పోటీల్లో (70 ఏళ్ల కేటగిరీ) వికారాబాద్​కు చెందిన ఎండీ హఫీజ్ సత్తా చాటారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి మొదటి స్థానంతో మెరిట్ సర్టిఫికెట్ సాధించారు. 

ఈ నేపథ్యంలో వికారాబాద్​లో ఎండీ హఫీజ్​ను బుధవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్​ కుమార్​ అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు ఎస్​.రామచంద్రారెడ్డి, రాజశేఖర్​రెడ్డి పాల్గొన్నారు.