లైబ్రరీలకు పర్మినెంట్ బిల్డింగులు నిర్మించాలి:అసెంబ్లీ స్పీకర్

లైబ్రరీలకు పర్మినెంట్ బిల్డింగులు నిర్మించాలి:అసెంబ్లీ స్పీకర్
  • అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్, వెలుగు: లైబ్రరీలు ఆధునిక విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లాలని అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. నిరుద్యోగులకు ప్రతి గ్రంథాలయం కల్పవృక్షంగా మారాలని చెప్పారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​గా ఎస్.రాజేశ్​రెడ్డి బాధ్యతలు చేపట్టారు.

 ముఖ్య అతిథులుగా శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాంమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, అడిషనల్​కలెక్టర్ లింగ్యా నాయక్, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యుడు రమేష్ ముదిరాజ్, రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి సురేష్ బాబు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి లైబ్రరీకి పక్కా, శాశ్వత భవనాలు నిర్మించాలని సూచించారు. అన్ని రకాల పుస్తకాలు అందుబా టులో ఉంచాలన్నారు. లైబ్రరీలకు ఏ చిన్న అవసరం వచ్చినా సంప్రదించాలని చెప్పారు. ప్రమాణస్వీకారం అనంతరం ఎస్.రాజేశ్​రెడ్డి మాట్లాడుతూ.. లైబ్రరీల్లో అన్నిరకాల పుస్తకాలు అందుబాటులో ఉంచుతామని, జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. 

ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే వికారాబాద్ లోని రాజీవ్​గృహకల్ప ప్రాంతంలో అడ్వాన్సుడ్​టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు స్పీకర్​గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం భూమి పూజ చేశారు. రూ.5 కోట్ల అంచనాతో ఈ సెంటర్​ను నిర్మిస్తున్నట్లు తెలిపారు.