ఎమ్మెల్యేలపై వేటు అంశంలో స్పీకర్​ నిర్ణయం తీసుకుంటారు: మంత్రి శ్రీధర్​ బాబు

ఎమ్మెల్యేలపై వేటు అంశంలో స్పీకర్​ నిర్ణయం తీసుకుంటారు: మంత్రి శ్రీధర్​ బాబు

ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశంపై శాసనసభాపతి నిర్ణయం తీసుకుంటారని మంత్రి శ్రీధర్​ బాబు అన్నారు.   కాంగ్రెస్​ ఇచ్చిన ఎన్నికల హామీలను ఈ ఐదేండ్లలో అమలు చేస్తామంటూ.. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ కీలకంగా ఉంది. కొంతమంది తెలంగాణ అప్పుల గురించి మాట్లాడుతున్నారని... బీఆర్​ఎస్​ ప్రభుత్వం అప్పులు చేసి దుబారాగా ఖర్చు పెడితే.... కాంగ్రెస్​ ప్రభుత్వం.. రుణమఫీ.. మహిళలకు ఉచిత ప్రయాణం  లాంటి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.  హైడ్రా విషయంలో స్పందించిన మంత్రి చెరువులు, వనరులను కాపాడటానికే నని.. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు ఎలాంటి పని చేసిన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నరు.  పదేళ్ల బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఏంచేసిందన్న మంత్రి.. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ఆరు గ్యారెంటీలనుఅమలు చేశామన్నారు.  

తెలంగాణ ప్రజల కలను సోనియాగాంధీ సాకారం చేశారన్నారు.  తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. సాంకేతికంగా భారతదేశాన్ని మహనీయుడు రాజీవ్​ గాంధీ అని.. అలాంటి మహనీయుడి విగ్రహంపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు. రాజీవ్​ గాంధీ విగ్రహం తొలగింపు విషయంలో  ఆలోచించాలని సీఎం రేవంత్​రెడ్డి ప్రజలను కోరారన్నారు.