ఇయ్యాల (మార్చ్ 29న) గురుకుల ఎంట్రన్స్ ప్రత్యేక కేటగిరీ ఫలితాలు

ఇయ్యాల (మార్చ్ 29న) గురుకుల ఎంట్రన్స్ ప్రత్యేక కేటగిరీ ఫలితాలు

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశం కోసం ప్రత్యేక కేటగిరీ విద్యార్థులు రాసిన ఎంట్రన్స్​టెస్ట్​ఫలితాలు శనివారం రిలీజ్ చేస్తామని ఎస్టీ గురుకుల సెక్రటరీ, సెట్ కన్వీనర్ అలుగు వర్షిణి వెల్లడించారు.  

ప్రత్యేక కేటగిరీలో వికలాంగులు(పీహెచ్ సీ) , ఆర్ఫన్(అనాథలు) , ఫిషర్ మన్ (మత్స్య కార్మికులు) మైనారిటీ, క్యాప్, ఈడబ్ల్యూఎస్, ఏఈక్యూ , ఏజెన్సీ ఏరియా, ఎంబీసీ కేటగిరీలు ఉన్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. మిగతా కేటగిరీలకు చెందిన ఫలితాలను వచ్చే నెల  5 వ తేదీలోపు వెల్లడిస్తామని పేర్కొన్నారు.