
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లాకు అధిక నిధులు కేటాయించి రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. వికారాబాద్అసెంబ్లీ నియోజకవర్గంలో గురువారం ఆయన పర్యటించారు. తొలుత మర్పల్లి మండలం రావులపల్లిలో పార్వతీ సమేత పీతాంబరేశ్వర ఆలయంలో శివపార్వతుల కల్యాణోత్సవానికి హాజరయ్యారు.
మర్పల్లి మండలంలో ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. ప్రజల ఇబ్బందులు తొలగించడానికి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి తన నియోజకవర్గంలోని అన్ని గ్రామాల రోడ్ల బాగుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం వికారాబాద్ మండలంలోని పులుసుమామడి గ్రామ శివారులో పరమేశ్వరుడి గుట్టపై ఆయన ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొండల్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్కిషన్ నాయక్, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.