గ్రామాల అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టాలి : కలెక్టర్ రాహుల్ శర్మ

గ్రామాల అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టాలి :  కలెక్టర్ రాహుల్ శర్మ

కాటారం, వెలుగు: గ్రామాల అభివృద్ధిపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టాలని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బుధవారం కాటారం ఎంపీడీవో ఆఫీస్​లో గ్రామాల స్పెషల్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని సూచించారు. ఆరుబయట వ్యర్థాలను కాలిస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం రూ.25 వేల జరిమానా విధించాలన్నారు.

అనంతరం మహాముత్తారం మండలంలోని మోడల్​ పాఠశాలను కలెక్టర్​ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గది, ఆహారాన్ని పరిశీలించారు. మహాముత్తారం పీహెచ్​సీ సందర్శించి, వైద్యంపై ఆరా తీశారు. కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్​సింగ్, అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, డీపీవో నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.