
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్ లోని ప్రసిద్ధ నవనాథ సిద్దులగుట్టపై సోమవారం భక్తుల సందడి కనిపించింది. గుట్టపైన ఉన్న శివాలయం, రామాలయం, అయ్యప్ప మందిరాల్లో పురోహితులు నందీశ్వర మహారాజ్, కుమార్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. రామాలయం నుంచి ఉత్సవ మూర్తులతో జీవ కోనేరు వరకు పల్లకి సేవ జరుపగా, భక్తులు భజనలు పాడుతూ, నృత్యాలు చేశారు. అనంతరం సుకన్య, మహేశ్ కుటుంబీకుల ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మందిర కమిటి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.