
హైదరాబాద్సిటీ, వెలుగు: నార్త్ ఇండియాలో ప్రఖ్యాతి గాంచిన పుణ్య క్షేత్రాలను సందర్శించాలనుకునే వారి కోసం ఐఆర్ సీటీసీ ప్రత్యేక రైలును నడపనుంది. హరిద్వార్, రుషికేశ్, వైష్ణోదేవి, అమృత్సర్, ఆనంద్పూర్ తదితర ప్రదేశాలను చూడాలనుకునే తెలంగాణ, ఏపీ వాసుల కోసం స్పెషల్ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది.
విజయవాడ నుంచి ప్రారంభమయ్యే భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు మానసాదేవి ఆలయం, హర్- కీ -పౌరీ (సాయంత్రం)వద్ద గంగా -హారతి, రామ్ జూలా, లక్ష్మణ్ జూలా, ఆనంద్ సాహిబ్ గురుద్వార్, నైనా దేవి ఆలయం, గోల్డెన్ టెంపుల్ , వాఘా బోర్డర్ (సమయం అనుమతిస్తే) వంటి ప్రదేశాలను వెళ్లనుంది. ఈ రైలు విజయవాడతో పాటు గుంటూరు, తెలంగాణలోని నల్గొండ, సికింద్రాబాద్, కాజీపేట్, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్నగర్ స్టేషన్లలో ఆగుతూ వెళ్తుంది.10 రోజుల పాటు కొనసాగే ఈ యా త్ర ఈ నెల 23న మొదలవుతుందని రైల్వే
అధికారులు తెలిపారు.