
- బ్రిటీష్ ఇండియాలో చాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ అధ్యక్షుడు భూపాల్ నవాబు సంస్థానాల్లో ప్రాతినిధ్య ప్రభుత్వానికి భిన్నంగా బాధ్యతాయుత ప్రభుత్వాలను ఏర్పరచే ప్రశ్న తలెత్తదని 1944 జులై 26న నిజాం ప్రభుత్వం ప్రకటించింది.
- నిషేధం తొలగించిన తర్వాత హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మహాసభ 1947 జూన్ 16 , 17, 18వ తేదీల్లో ముషీరాబాద్ మైదానంలో జరిగింది.
- 1947 జూన్లో జరిగిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మహాసభకు స్వామి రామానంద తీర్థ అధ్యక్షత వహించారు.
- హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మహాసభల్లో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం కావాలనే తీర్మానాన్ని బూర్గుల రామకృష్ణారావు చదివారు.
- 1947 ఆగస్టు 7న జాయిన్ ఇండియా దినం పాటించాలని హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పిలుపు ఇచ్చింది.
- జాయిన్ ఇండియా ఉద్యమంలో భాగంగా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సరిహద్దు శిబిరాలకు పి.వి.నర్సింహారావు, కె.వి.నర్సింగరావు, కోదాటి నారాయణరావు, టి.హయగ్రీవాచారి చేరుకున్నారు.
- జవహర్లాల్ నెహ్రూ స్వామి రామానంద తీర్థకు అందజేసిన జాతీయ జెండాను 1947 ఆగస్టు 15న సుల్తాన్ బజార్లో మోతీలాల్ మంత్రి ఎగురవేశారు.
- నిజాం సరిహద్దు అవతల ఉన్న యూనియన్ ప్రాంతం నుంచి వచ్చే పాలు, పెరుగు, కూరగాయలు, పండ్లు, ఇతర రోజువారీ వినియోగానికి అవసరమయ్యే సామగ్రిపై నిజాం కరోడ్గిరి పన్ను వసూలు చేసేవారు.
- అబ్కారీ ఆదాయానికి ముఖ్యమైన చెట్లు తాటి, ఈత, ఇప్పచెట్లు నిజాం కాలంలో ఈత, తాటి, ఇప్ప చెట్లను నరికిన వారికి శిక్షలతో వేధించేవారు.
- నిజాం ప్రభుత్వానికి భూమి శిస్తు తర్వాత ముఖ్యమైన మరో ఆదాయం ఆబ్కారీ.
- నిజాం తాను స్వతంత్రుడనని 1947 ఆగస్టు 14న ఫర్మానా జారీ చేశాడు.
- ఇత్తేహాదుల్ ముస్లిమీన్ పార్టీని 1927లో స్థాపించారు.
- ఇత్తేహాదుల్ ముస్లిమీన్ పార్టీ అధ్యక్షుడు బహదూర్ యార్ జంగ్.
- ఒక సాంస్కృతిక సంస్థగా ఆవిర్భవించిన ఇత్తేహాదుల్ ముస్లిమీన్ సంపూర్ణ ప్రజా వ్యతిరేక ఉద్యమంగా 1937 నుంచి మారింది.
- 1946లో ఇత్తేహాదుల్ ముస్లిమీన్ పార్టీ ఖాసిం రజ్వీ అధ్యక్షుడయ్యాడు.
- 1930–40 ప్రాంతంలో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వెట్టిచాకిరి, బేగారీ వంటి సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా కామ్రేడ్స్ అసోసియేషన్ పోరాటం ప్రారంభించింది.
- నిజాం రాజుకు, భారత ప్రభుత్వానికి మధ్య 1947 నవంబర్ 29న యధాతథ ఒప్పందం కుదిరింది.
- యధాతథ ఒప్పందం సంస్థాన ప్రజలను నిజాం దయాదాక్షిణ్యాలపై వదిలేసిందని ఫ్రీ ప్రెస్ జర్నల్ వ్యాఖ్యానించింది.
- హైదరాబాద్ ప్రజలను ఇత్తేహాదుల్ తోడేలు ముందు అప్పగించడమే కాకుండా సంస్థానంలో మ్యూనిచ్ ఒప్పందం పునరావృతమైందని ఫ్రీ ప్రెస్ జర్నల్ పత్రిక పేర్కొన్నది.
- యధాతథ ఒప్పందంపై సంతకం చేయడమంటే హైదరాబాద్లో కెఎం మున్షీ భారత ఏజెంట్ జనరల్గా నియమించింది.
- రజాకార్ల చేతిలో ఇమ్రోజ్ పత్రిక సంపాదకుడు షోయబుల్లాఖాన్ హత్యకు గురయ్యాడు.
- హైదరాబాద్ ప్రాంతంపై సైనిక చర్యకు ఉపక్రమించాలని భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 9న నిర్ణయానికి వచ్చింది.
- హైదరాబాద్ సంస్థానంపై సైనిక చర్యకు భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 10న హెచ్చరిక జారీ చేసింది.
- హైదరాబాద్ సంస్థానంపై భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 13న సైనిక చర్య ప్రారంభించింది.
- హైదరాబాద్ సంస్థానంపై భారత సైనిక చర్యకు అప్పటి భారత గవర్నర్ జనరల్ సి. రాజగోపాలాచారి పోలీసు చర్య అని పేరు పెట్టారు.
- హైదరాబాద్ సంస్థానంపై భారత సైనిక చర్యను సైనిక పరిభాషలో ఆపరేషన్ పోలో అని పేర్కొన్నారు.
- హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో 1948 సెప్టెంబర్ 18న విలీనమైంది.
- హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడంతో సంస్థాన ప్రధాని మీర్ లాయక్ అలీ పాకిస్తాన్ పారిపోయాడు.
- సైన్యం నిర్బంధంలోకి తీసుకున్న ఖాసిం రజ్వీని 1959లో విడుదల చేశారు.