
హసన్ పర్తి,వెలుగు : హనుమకొండ జిల్లా భీమారంలోని ఎస్వీఎస్ కాలేజీ లో స్ప్రింగ్ ఫైర్ 24 వేడుకలు అదివారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా కాలేజీ పూర్వ విద్యార్థి జబర్దస్త్ ఫేమ్ రచ్చ రవి, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ వరుణ్ వచ్చారు. ఈ కార్యక్రమంలో కాలేజీ చైర్మన్ డా . తిరుమల రావు పాల్గొన్నారు.