సాగర్ ను సందర్శించిన శ్రీలంక టూరిజం ప్రమోటర్స్

సాగర్ ను సందర్శించిన శ్రీలంక టూరిజం ప్రమోటర్స్

హాలియా, వెలుగు: అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ ను బుధవారం శ్రీలంక టూరిజం ప్రమోటర్స్ సందర్శించారు. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని  పర్యాటక ప్రాంతాలను శ్రీలంక దేశంలో ప్రమోట్ చేయడానికి  ఆ  దేశపు టూరిజం,  ట్రావెల్  ప్రతినిధులు నాగార్జునసాగర్ కు వచ్చారు.

 ఈ సందర్భంగా ఈ బృందం టూరిజం లాంచీలో నాగార్జున కొండకు చేరుకొని అక్కడ మ్యూజియాన్ని,  సింహాల విహారం, మహా స్థూపాన్ని  సందర్శించారు.  ఇక్కడి నుంచి వరంగల్​, హనుమకొండ లోని చారిత్రక ప్రదేశాలను ,దేవాలయాలను  సందర్శిస్తామని తెలిపారు.  వారి వెంట బుద్ధవనం ఈవో శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, అసిస్టెంట్ మేనేజర్ సాయిరాం, శ్రీలంక ఎయిర్లైన్స్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు.