ఎడపల్లి శ్రీ రామ మఠంలో రామనవమి ఉత్సవాలు

ఎడపల్లి శ్రీ రామ మఠంలో రామనవమి ఉత్సవాలు

ఎడపల్లి,  వెలుగు :  ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ రామ మఠంలో  ఆదివారం శ్రీ రామ నవమి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ మఠంలో ప్రతీ ఏటా ఉగాది రోజు నుండి శ్రీరామ నవమి వరకు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ . ఈ ఉత్సవాలను ఉగాది రోజు మొదలు ఏప్రిల్​ 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు.  ఆదివారం వినాయక పూజ, అఖండ దీపారాదన, దేవతలకు అభిషేకం, నూతన వస్తాదారణ తో పాటు రామ మఠంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు.