Mathu Vadalara 2: ఈ మత్తు దసరా వరకు..సింహా, సత్య మ్యాజిక్కు ..ఏకంగా అన్ని కోట్లు

Mathu Vadalara 2: ఈ మత్తు దసరా వరకు..సింహా, సత్య మ్యాజిక్కు ..ఏకంగా అన్ని కోట్లు

శ్రీసింహ, సత్య, ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్స్‌‌లో రితేష్ రానా రూపొందించిన చిత్రం ‘మత్తు వదలరా2’. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌‌తో రన్ అవుతోందని తెలియజేస్తూ  సక్సెస్‌‌మీట్ నిర్వహించారు మేకర్స్.

శ్రీసింహ మాట్లాడుతూ ‘మేము ఊహించినదానికంటే  సినిమా పెద్ద హిట్ అయినందుకు హ్యాపీగా ఉంది. పార్ట్ 3 కోసం అందరిలాగే  ఈగర్‌‌‌‌గా వెయిట్ చేస్తున్నా’ అన్నాడు. సినిమాతో పాటు తన పెర్ఫార్మెన్స్‌‌కి వండర్‌‌‌‌ఫుల్ రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉందని ఫరియా చెప్పింది. ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు చెప్పాడు దర్శకుడు రితేష్.

ఈ సినిమా ఒక మంచి స్ట్రెస్ బస్టర్ అని చాలామంది చెబుతున్నారని నిర్మాత చెర్రీ  అన్నారు. ‘మా అంచనాలను క్రాస్ చేసి వరల్డ్ వైడ్‌‌గా ముప్ఫై కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. నార్త్ అమెరికాలో వన్ మిలియన్ మార్క్ దాటింది. ఓవర్సీస్‌‌లోనే పది కోట్లు కలెక్ట్ చేయడం  ఆనందాన్ని ఇచ్చింది. ఈ రన్  దసరా వరకు  స్ట్రాంగ్‌‌గా ఉంటుందని భావిస్తున్నాం’ అని నిర్మాత రవిశంకర్ అన్నారు.