గోపాలపల్లిలో వైభవంగా వారిజాల వేణుగోపాల స్వామి కల్యాణం

గోపాలపల్లిలో వైభవంగా వారిజాల వేణుగోపాల స్వామి కల్యాణం
  • .పాల్గొన్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్​రెడ్డి

నార్కట్ పల్లి వెలుగు: నల్లగొండ జిల్లా నార్కట్​పల్లిమండల పరిధిలోని గోపాలపల్లి సమీపంలో   వారిజాల వేణుగోపాల స్వామి   కల్యాణం బుధవారం  వైభవంగా జరిగింది. దేవాలయం ప్రధాన అర్చకులు మచ్చ గిరి, కారంపూడి కృష్ణమాచార్యులు,  దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ కోమటి రెడ్డి మోహన్​ రెడ్డి  కల్యాణానికి పట్టు వస్త్రాలను  సమర్పించారు. అనంతరం​   మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...   వేణుగోపాలస్వామి దేవస్థానానికి 400 సంవత్సరాల చరిత్ర ఉందని,  ప్రపంచంలో ఎంత కరువు ఉన్నా ఈ కోనేరులో మాత్రం నిత్యం నీరు ఉంటుందన్నారు. 

ఈ దేవస్థానాన్ని , చెరువుగట్టు దేవస్థానాన్ని ప్రభుత్వం తరఫున మరింత అభివృద్ధి చేస్తామని. ఈ దేవస్థానానికి సమీపంలో ఉన్న బ్రాహ్మణ వెల్లంల  ఎత్తిపోతల ప్రాజెక్టుని  కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.  80శాతం  పూర్తయిన ప్రాజెక్టులను కేసీఆర్ పక్కన పెట్టడం వల్లనే ప్రజల పాపం తలిగి బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఓడిపోయిందని అన్నారు.   కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఉషయ్య గౌడ్, మాజీ ఎంపీటీసీ పాశం శ్రీనివాస్ రెడ్డి, వడ్డె భూపాల్​ రెడ్డి,మాజీ సర్పంచ్ భద్రాచలం,పుల్లెంల అచ్చాలు,దూదిమెట్ల సత్తయ్య పాల్గొని కళ్యాణం  తిలకించారు.  తలంబ్రాల బియ్యం ని వచ్చిన భక్తులు దేవుడు కివసమర్పించారు. కళ్యాణం లో దాదాపు 100 మంది దంపతులు పాల్గొన్నారు.