కమర్షియల్​ వెహికల్స్​ ధరలు పెరిగాయి

 కమర్షియల్​ వెహికల్స్​ ధరలు పెరిగాయి
  • శ్రీరామ్ మొబిలిటీ వెల్లడి

హైదరాబాద్​: దేశవ్యాప్తంగా గత నెల కమర్షియల్​వెహికల్స్​(సీవీల)ల ధరలు పెరిగాయని శ్రీరామ్ మొబిలిటీ బులెటిన్‌‌‌‌ తెలిపింది. దీని రిపోర్ట్​ ప్రకారం.. పండుగల కారణంగా ట్రక్కులకు డిమాండ్‌‌‌‌ బాగా పెరిగింది.  యూజ్డ్ కమర్షియల్ వెహికల్స్ (యూసీవీల) ధరలు 4–7శాతం పెరిగాయి.  అయితే సెడాన్లు,  కాంపాక్ట్ ఎస్​యూవీల్లో యూజ్డ్ ప్యాసింజర్ వెహికల్స్​ ధరలు వార్షికంగా ఆరు శాతం నుంచి 10శాతం వరకు క్షీణించాయి.  మారుతి స్విఫ్ట్  మారుతి ఎర్టిగా ధరలు 10శాతం తగ్గాయి. మహీంద్రా స్కార్పియో,  హ్యుందాయ్ క్రెటా రీసేల్ ధరలు ఆరు శాతం తగ్గాయి. 

 పాత  టూవీలర్​ మోడల్స్​ హోండా షైన్,  బజాజ్ పల్సర్ వరుసగా 3శాతం,  2శాతం పడిపోయాయి.  డిస్కౌంట్ల ఫలితంగా కొత్త వెహికల్స్​ అమ్మకాలు ఊపందుకున్నాయి. జులైలో కార్ల అమ్మకాలు నెలవారీగా 11శాతం, వార్షికంగా 9శాతం  పెరిగాయి.  టూవీలర్స్​ అమ్మకాలు నెలవారీగా  5శాతం పెరిగాయి.