
శ్రీ రామ నవమి పండుగ శ్రీరామునికి అంకితం చేయబడింది. ఈ పండుగను శ్రీరాముని జన్మదినోత్సవంగా.. జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్షం తొమ్మిదో తేదీన పవిత్రమైన రామ నవమిని జరుపుకుంటారు. రాముని అనుగ్రహం పొందడానికి భక్తులు రామ నవమి నాడు రాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సంవత్సరం 2025 లో శ్రీ రామ నవమి ఏప్రిల్ 6 న జరుపుకోనున్నారు. పురాణాలు.. పండితులు తెలిసిన వివరాల ప్రకారం ఆరోజు సీతారామచంద్రులను ఎలా పూజిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. . .
ధనలాభం కోసం : ఆర్థిక లాభం కోసం, రామ నవమి సాయంత్రం ఒక గిన్నెలో నీటిని తీసుకుని రామరక్షా మంత్రాన్ని ‘ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః’ 108 సార్లు జపించండి. ఈ పవిత్ర జలాన్ని ఇంటి నలుమూలల్లో చల్లండి.
సంతానం కోసం: కొబ్బరికాయను తీసుకుని ఎర్రటి గుడ్డలో చుట్టి సీతాదేవికి సమర్పించి, ‘ఓం నమః శివాయ’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.
ఆనందం, శాంతి కోసం: దేవాలయం ధ్వజస్థంభం ఎదురుగా నెయ్యి లేదా నూనె దీపం వెలిగించి...శ్రీరామ్ జై రామ్ జై జై రామ్.... అని 108 సార్లు జపించండి.
ఆరోగ్యం కోసం : శ్రీ రామ నవమి సాయంత్రం ఏదైనా హనుమంతుడి ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా పఠించి... ఓం హనుమతే నమః... అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.
వివాహంలో అడ్డంకులను తొలగిపోవడానికి : శ్రీ రామ నవమి రోజు సాయంత్రం సీతారాములకు పసుపు, కుంకుమ, గంధాన్ని సమర్పించి.....ఓం జై సీతా రామ్....అని 108 సార్లు జపించండి.
శ్రీరాముడిని ఆరాధిస్తే ... అన్ని బాధలు.. కష్టాలు తొలగిపోయి జీవితం సుఖ సంతోషాలతో సాగుతుందని పండితులు చెబుతుంటారు. ఏక పత్నీ వ్రతుడు.. దశరథ తనయుడు .. ధర్మ వాక్ పరిపాలకుడు.. పరిపాలనా మార్గదర్శకుడు.. భగవాన్ శ్రీరామచంద్రుని అనుగ్రహం కోసం భక్తులు పూజలు చేస్తుంటారు. శ్రీరాముని అనుగ్రహం పొందడానికి భక్తులు రామ నవమి నాడు రాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు. . శ్రీ రామ నవమి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు నిర్మలమైన హృదయంతో పూర్తి భక్తి, విశ్వాసంతో తీసుకుంటే అవి ఖచ్చితంగా ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు.
►ALSO READ | Sriramanavami 2025: సీతమ్మ తల్లి అవతారం ముగించిన స్థలం ఇదే..!
భారతదేశంలో ప్రతిపల్లెలో కూడా రామాలయం ఉంటుంది.. ఒకవేళ ఏదైనా గ్రామంలో లేకపోయినా సరే ప్రతి ఏడాది చైత్ర శుద్ద నవమి రోజున పందిళ్లు వేసి సీతారాముల కళ్యాణం జరుపుతారు. . పెద్ద గ్రామాలైతే ప్రతి వీధిలో రాముని కల్యాణం జరుపుతారు. ఇక భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవానికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తరలి వస్తారు. హిందూ మతంలో శ్రీ రాముడి పట్ల ప్రజలకు అచంచలమైన విశ్వాసం , భక్తి ఉంటుంది.