
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఇందారం సింగరేణి గనిలో ప్రమాదం జరిగింది. 1Aగనిలో జరిగిన ఈ ప్రమాదంలో ఓ కార్మికునికి గాయాలయ్యాయి. కార్మికులు పనిచేస్తున్న సమయంలో సైడ్ వాల్ కూలడంతో సపోర్ట్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న రాజయ్య అనే కార్మికుడికి గాయాలయ్యాయి. ఈ ఘటనను గమనించిన తోటి కార్మికులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ప్రమాదంలో గాయపడిన కార్మికుడిని రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.