ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో ఎస్.ఎస్.రాజమౌళి

ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో ఎస్.ఎస్.రాజమౌళి

హైదరాబాద్​సిటీ, వెలుగు: ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. అంతర్జాతీయ డ్రైవింగ్​ లైసెన్స్​ను రెన్యువల్​ చేసుకున్నారు. నిబంధనల ప్రకారం సంతకం చేసి ఫొటో దిగారని ఆర్టీఏ జేటీసీ రమేశ్​కుమార్​ తెలిపారు. 

మహేశ్​బాబుతో తీస్తున్న సినిమా షూటింగ్​లో భాగంగా రాజమౌళి విదేశాలు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్స్​రెన్యువల్​కోసం వచ్చారు.