
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 7500 పోస్టులను భర్తీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వశాఖలు/విభాగాలు/సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గ్రూప్ బి, గ్రూప్ సీ పోస్టుల కోసం కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షలు నిర్వహించనుంది. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 3 నుంచి మే 03 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
పోస్టుల ఇవే..
ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ విభాగంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, ఇంటెలిజెన్స్ బ్యూరో సహా పలు శాఖల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సీబీడీటీలో ఇన్కం ట్యాక్స్ ఇన్స్పెక్టర్, సీబీఐలో సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, ఎన్హెచ్ఆర్సీలో రీసెర్చి అసిస్టెంట్, ఎన్ఐఏలో సబ్ ఇన్స్పెక్టర్, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోలో సబ్ ఇన్స్పెక్టర్/ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, కాగ్లో ఆడిటర్, అకౌంటెంట్, తపాలాశాఖలో పోస్టల్ అసిస్టెంట్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, సీబీడీటీలో ట్యాక్స్ అసిస్టెంట్, నార్కొటిక్స్ బ్యూరో, ఆర్థిక మంత్రిత్వశాఖలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి.
- శాలరీ : నెలకు రూ.25,500ల నుంచి రూ.1,51,100 ఆయా పోస్టులను బట్టి ఉంటుంది
- అర్హతలు : డిగ్రీ పూర్తైన వారు.
- వయోపరిమితి : 18 ఏళ్ల నుంచి 32 ఏళ్లలోపు వారు అర్హులు.
- ఫీజు : రూ. 100
- ఎంపిక ప్రక్రియ: రెండు దశల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. టైర్ 1 పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. టైర్ 2 పరీక్షలో మూడు పేపర్లు ఉంటాయి. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు
చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
- దరఖాస్తులు: ఏప్రిల్ 3 నుంచి మే 3 వరకు
- ఆన్లైన్లో ఫీజు లాస్ట్ డేట్ : మే 4 రాత్రి 11గంటల వరకు
- దరఖాస్తుల్లో సవరణ: మే 7 నుంచి 8వరకు
- టైర్ 1 కంప్యూటర్ ఆధారిత పరీక్ష జులైలో ఉంటుంది
- టైర్ 2 పరీక్షలకు తేదీలను తర్వాత ఖరారు చేస్తారు.