కానిస్టేబుల్​ పోస్టులకు స్టాఫ్​ సెక్షన్ కమిషన్ నోటిఫికేషన్

కానిస్టేబుల్​ పోస్టులకు స్టాఫ్​ సెక్షన్ కమిషన్  నోటిఫికేషన్

స్టాఫ్​ సెక్షన్ కమిషన్​ (ఎస్​ఎస్​సీ) ఢిల్లీ పోలీసు విభాగంలోని 7547 కానిస్టేబుల్​ (ఎగ్జిక్యూటివ్​) పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్​ రిలీజ్ అయింది. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్​ 30లోగా ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి.

అర్హత: అభ్యర్థులు 10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కచ్చితంగా వ్యాలీడ్​ డ్రైవింగ్​ లైసెన్స్​ ఉండాలి. 2023 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. శారీరక ప్రమాణాలు పురుషుల ఎత్తు 170 సెం.మీ., ఛాతీ 81 సెం.మీ ఉండాలి. మహిళల ఎత్తు 157 సెం.మీ ఉండాలి.
సెలెక్షన్​:  అభ్యర్థులకు కంప్యూటర్​ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఫిజికల్​ ఎఫీషియన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ మెజర్​మెంట్ టెస్ట్ (పీఎంటీ) నిర్వహిస్తారు. 2023 డిసెంబర్​లో పరీక్ష జరిగే అవకాశం ఉంది.
ఎగ్జామ్​ ప్యాటర్న్​: కంప్యూటర్ ఆధారిత పరీక్షలో 100 ప్రశ్నలు - 100 మార్కులకు ఉంటాయి. 
దరఖాస్తులు: జనరల్​, ఓబీసీ అభ్యర్థులు రూ.100 అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి.అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో సెప్టెంబర్​ 30 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు  www.ssc.nic.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.