
స్టాఫ్ సెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఢిల్లీ పోలీసు విభాగంలోని 7547 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 30లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
అర్హత: అభ్యర్థులు 10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కచ్చితంగా వ్యాలీడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. 2023 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. శారీరక ప్రమాణాలు పురుషుల ఎత్తు 170 సెం.మీ., ఛాతీ 81 సెం.మీ ఉండాలి. మహిళల ఎత్తు 157 సెం.మీ ఉండాలి.
సెలెక్షన్: అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ) నిర్వహిస్తారు. 2023 డిసెంబర్లో పరీక్ష జరిగే అవకాశం ఉంది.
ఎగ్జామ్ ప్యాటర్న్: కంప్యూటర్ ఆధారిత పరీక్షలో 100 ప్రశ్నలు - 100 మార్కులకు ఉంటాయి.
దరఖాస్తులు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.ssc.nic.in వెబ్సైట్లో సంప్రదించాలి.