బాంద్రా రైల్వేస్టేషన్లో తొక్కిసలాట..తొమ్మిది మందికి గాయాలు

బాంద్రా రైల్వేస్టేషన్లో తొక్కిసలాట..తొమ్మిది మందికి గాయాలు

ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగింది. ఆదివారం ( అక్టోబర్ 27) ఉదయం జరిగిన ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. బాంద్రా టెర్మినస్ లోని ఒకటో నంబర్ ప్లాట్ ఫాంపై ఉదయం 5.56 గంటలకు బాంద్రా -గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కే సమయంలో ఈ ఘటన జరిగింది. గాయబడినవారిని భాభా ఆస్పత్రికి తరలించారు. 

Also Read :- అమెరికా వీసాకోసం సర్టిఫికెట్ ఫోర్జరీ కేసు

గాయపడిన వారిని షభీర్ అబ్దుల్ రెహ్మాన్ (40), పరమేశ్వర్ సుఖ్‌దర్ గుప్తా (28), రవీంద్ర హరిహర్ చుమా (30), రామసేవక్ రవీంద్ర ప్రసాద్ ప్రజాపతి (29), సంజయ్ తిలక్రం కాన్గే (27), దివ్యాంశు యోగేంద్ర యాదవ్ (18), మహ్మద్‌, షరీఫ్ షేక్ (25), ఇంద్రజిత్ సహాని (19), నూర్ మహ్మద్ షేక్ (18) లుగా అధికారులు గుర్తించారు.