మెరీనా బీచ్‎లో తొక్కిసలాట.. ముగ్గురు మృతి.. 100 మందికి పైగా గాయాలు

మెరీనా బీచ్‎లో తొక్కిసలాట.. ముగ్గురు మృతి.. 100 మందికి పైగా గాయాలు

చెన్నైలోని మెరీనా బీచ్‌లో భారత వైమానిక దళం నిర్వహించిన మెగా ఎయిర్ షో లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఇవాళ (2024, అక్టోబర్ 6) మెరీనా బీచ్‎లో ఏర్పాటు చేసిన మెగా ఎయిర్ షోను చూసేందుకు లక్షలాదిగా సందర్శకులు వచ్చారు. ఊహించని సంఖ్యలో జనం తరలిరావడంతో తొక్కి సలాట జరిగింది. ఈ ఘటనలో వందల మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగానే, ఎయిర్ షో ముగిశాక ఒక్కసారిగా లోకల్ రైల్వే స్టేషన్‎కు జనం క్యూ కట్టారు. ఈ క్రమంలో రైల్వేస్టేషన్ వద్ద తొక్కిసలాట జరిగింది. 

ఈ తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, రెస్య్కూ టీమ్స్ ఘటన స్థలంలో సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ తొక్కి సలాటలో మృతుల సంఖ్యలో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.