![మాకు అండగా నిలబడండి ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో సభ్యదేశాలను కోరిన ఐసీసీ](https://static.v6velugu.com/uploads/2025/02/stand-by-us-icc-asked-the-member-countries-in-the-background-of-trumps-sanctions_AJV3bf5Kxy.jpg)
ది హేగ్: అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలను ఆ సంస్థ ఖండించింది. ట్రంప్ విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా నిలబడాలని తన సభ్యదేశాలను ఐసీసీ కోరింది. ఈ చర్య ఐసీసీ స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయ వ్యవస్థకు హాని కలిగిస్తుందని పేర్కొంది. అమెరికా దాని మిత్రదేశమైన ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకొని ఐసీసీ చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు.
దీంతో ఐసీసీపై ఆంక్షలు విధిస్తూ గురువారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న నరమేధానికి ఆ దేశ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహుపై ఐసీసీ గతేడాది అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ ట్రంప్ ఐసీసీపై ఆంక్షలు విధించారు. ఐసీసీ అధికారులు అమెరికాలో అడుగుపెట్టకుండా చేశారు.
కాగా, ప్రపంచవ్యాప్తంగా వేధింపులకు, అణచివేతకు గురైన బాధితులకు ఐసీసీ అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతుందని ఓ ప్రకటనలో తెలిపింది. న్యాయం కోసం, ప్రాథమిక మానవ హక్కుల కోసం ప్రపంచ దేశాలతో పాటు 125 ఐసీసీ
సభ్య దేశాలు అండగా నిలబడాలని కోరింది.