హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్కు చెందిన స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ ఐపీఓ కోసం తన డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ)ని సెబీకి అందజేసినట్టు తెలిపింది. పబ్లిక్ఇష్యూ ద్వారా రూ. 600 కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్టు తెలిపింది. ఇందులో మొత్తం రూ. 250 కోట్ల వరకు ఫ్రెష్ ఇష్యూ ఉంటుంది. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.350 కోట్ల విలువైన 18.444 మిలియన్ల షేర్లు అమ్మకానికి వస్తాయి.
ప్రమోటర్లు కందుల రామకృష్ణ, కందుల కృష్ణ వేణి, నాగేశ్వర్ రావు కందుల, కాట్రగడ్డ మోహన్ రావు, కాట్రగడ్డ శివప్రసాద్, కుదరవల్లి పున్నారావు ఈ ఆఫర్ ద్వారా తమ హోల్డింగ్స్లో కొంత భాగాన్ని విక్రయిస్తారు. ఫార్మా, కెమికల్ రంగాల కోసం ప్రత్యేక ఇంజినీరింగ్ పరికరాలను తయారు చేస్తున్న హైదరాబాద్కు చెందిన కంపెనీ 100 శాతం బుక్ బిల్డింగ్ ప్రక్రియ ద్వారా నిధులను సేకరిస్తుంది. ఇది ఈ ఆఫర్ ద్వారా వచ్చే ఆదాయాన్ని మూలధన వ్యయం, ఇప్పటికే ఉన్న కొన్ని అప్పులను తిరిగి చెల్లించడం, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంది.