రాష్ట్రంలో స్టాండింగ్ కమిటీ పర్యటన..ప్రభుత్వ పథకాల అమలు తీరు పరిశీలన 

రాష్ట్రంలో స్టాండింగ్ కమిటీ పర్యటన..ప్రభుత్వ పథకాల అమలు తీరు పరిశీలన 

హైదరాబాద్, వెలుగు: కేంద్ర గ్రామీణాభివృద్ధి పథకాల పరిశీలనకు స్టాండింగ్  కమిటీ  శనివారం నుంచి ఈ నెల 21 వరకు రాష్ట్రం లో పర్యటించనున్నది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖల పనితీరు తెలుసుకునేందుకు హైదరాబాద్​తోపాటు పహల్గాం, పూరీ, శ్రీనగర్​లో పర్యటించనున్నది. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్​కు సంబంధించిన వివిధ పథకాల అమలులో బ్యాంకుల పాత్రను పరిశీలించనున్నాయి.

ఇందులో భాగంగా శుక్రవారం స్టాండింగ్ కమిటీ హైదరాబాద్ కు చేరుకుంది.  శనివారం ఉదయం 10.00 గంటలకు  నేషనల్  ఇన్‌‌స్టిట్యూట్  ఫర్  రూర ల్ డెవలప్‌‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్‌‌ (ఎన్ఐఆర్​డీ, పీఆర్)ను సందర్శించనున్నది.  కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు తీరుపై అధి కారులతో చర్చించనున్నట్లు తెలిసింది.  మధ్యాహ్నం 2.30 గంటలకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ వివిధ కార్యక్రమాలు, పథకాల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, యూనియన్  బ్యాంక్​ఆఫ్ ఇండియా అధికారులతో సమావే శం కానున్నది. ఆదివారం స్టాడింగ్  కమిటీ సభ్యులు తిరిగి వెళ్లనున్నారు.