
భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ గ్రామంలోని గుండవరపు సత్యవతి శ్రీనువాస్రావు మెమోరియల్ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ. 25 లక్షలతో కావేరీ సీడ్స్ నిర్మించిన సైన్స్ ల్యాబ్ను ఆ కంపెనీ ఎండి గుండవరపు భాస్కర్రావు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు ఈ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పాఠశాలను దత్తత తీసుకొని సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్టు వివరించారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ కుమారస్వామి, ఇన్చార్జి రాంగోపాల్రావు పాల్గొన్నారు.