
మెదక్ (కౌడిపల్లి), వెలుగు: పాలిసెట్ ఫలితాల్లో మెదక్ జిల్లా స్టూడెంట్ స్టేట్ 3వ ర్యాంకు సాధించాడు. మండల కేంద్రమైన కౌడిపల్లికి చెందిన గౌడిచర్ల నరేందర్ కొడుకు ప్రియాన్ష్ కుమార్ హవేలి ఘనపూర్ మహాత్మ జ్యోతిబాపూలే బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి పూర్తి చేశాడు.
ఇటీవల జరిగిన పాలిసెట్ ఎంట్రెన్స్లో ఎంపీసీ విభాగంలో పరీక్ష రాశాడు. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో స్టేట్ 3వ ర్యాంకు వచ్చింది.