
- రేపటి కేబినెట్ సమావేశంలో ఆమోదించే చాన్స్
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 6న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియెట్లో మంత్రివర్గం సమావేశం కానుంది. ఇందులో బీసీలకు 42 శాతం రిజర్వేష న్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తోంది. అలాగే, రేషన్ కార్డుల పంపిణీ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు, హెచ్ఎండీఏ మాదిరిగా ఫ్యూచర్సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు, భూ భారతి రూల్స్పై చర్చించే అవకాశం ఉంది.
రెండోసారి కులగణన సర్వేలో వచ్చిన వివరాలు, పూర్తి నివేదికపైనా కేబినెట్లో చర్చించనున్నట్టు తెలిసింది. ఇటీవలె అసెంబ్లీని ప్రోరోగ్చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో అసెంబ్లీ బడ్జెట్సమావేశాల నిర్వహణ పైనా నిర్ణయం తీసుకోనున్నారు. వీటితో పాటు లిక్కర్ రేట్ల పెంపు పైనా చర్చించ నున్నారు. ఎస్ఎల్బీసీ ఘటన, మహిళల కు అందిస్తున్న పథకాలు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు వంటి వాటిపై నా కేబినెట్సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులపై చర్చించారు. వాటిపై కూడా కేబినెట్లో చర్చ జరపనున్నారు.