
హైదరాబాద్ సిటీ, వెలుగు: అఫ్జల్ గంజ్లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీ రిపేర్లను వర్షాకాలంలోపు పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అఫ్జల్ గంజ్ లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీని ఆకస్మికంగా విజిట్చేశారు. రూ 5.5 కోట్లతో చేపట్టిన రిపేర్లను పరిశీలించారు. కాంపిటేటీవ్ ఎగ్జామ్స్ కు సంబంధించిన బుక్స్ తెలుగులో ఉన్నాయా? ఇంకా ఏమైనా కావాలా అని చీఫ్ లైబ్రేరియన్ ను అడిగారు. వివిధ భాషలకు చెందిన 5 లక్షల 31 వేల పుస్తకాలున్నాయని ఆయన సమాధానమిచ్చారు.
యూపీఎస్సీ ఎగ్జామ్స్ కు ప్రిపేరయ్యే వారి కోసం బుక్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. చదువుకోవడానికి వచ్చిన పలువురు అభ్యర్థులతో మాట్లాడారు. అడిషనల్ కలెక్టర్ కదిరవన్ పలని, లైబ్రరీస్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీహరి శంకర్, హెచ్ఎండీఏ డీఈ అభిలాష్, గ్రంథాలయ చీఫ్ లైబ్రేరియన్ టీజీవీ రాణి, సీనియర్ లైబ్రేరియన్ కేసరి హనుమంతు, లైబ్రరియన్ అపర్ణ పాల్గొన్నారు.