
- హైదరాబాద్లోని ఆఫ్జల్గంజ్లో ఉన్న స్టేట్ సెంట్రల్ లైబ్రరీని గతంలో ఆసఫియా స్టేట్ లైబ్రరీ అని పిలిచేవారు. ఈ లైబ్రరీని 1886లో స్థాపించారు.
- కొంత మంది దేశభక్తులు కలిసి హైదరాబాద్ ఓల్డ్ సిటీ లాల్దర్వాజ ప్రాంతంలో 1895లో భారత గుణవర్థక సంస్థను స్థాపించారు.
- సుల్తాన్బజార్లో 1901 సెప్టెంబర్ 1న శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపించారు.
- సికింద్రాబాద్లోని ఆంధ్ర సంవర్థిని గ్రంథాలయాన్ని 1905 సెప్టెంబర్ 30న స్థాపించారు. 1908 జనవరి 29న హనుమకొండలో రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం స్థాపించారు.
- హనుమకొండలోని రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం కార్యదర్శిగా మాడపాటి హనుమంతరావు పనిచేశారు.
- 1915లో ఎర్రుపాలెంలో మహబూబియా గ్రంథాలయం స్థాపించారు.
- 1917లో ఆంధ్ర విజ్ఞాన ప్రకాశన గ్రంథాలయాన్ని సూర్యాపేటలో స్థాపించారు.
- 1918లో ఆంధ్ర సరస్వతి గ్రంథాలయాన్ని నల్లగొండలో స్థాపించారు.
- మడికొండ, సిరిసిల్ల, చెన్నూర్లో గోదావరి వచనాలయాలు స్థాపించబడ్డాయి.
- 1939లో అణా గ్రంథాలయాలను కె.సి.గుప్తా స్థాపించారు.
- వట్టికోట ఆళ్వారుస్వామి స్థాపించిన గ్రంథాలయం దేశోద్ధారక గ్రంథాలయం.
- కోదాటి నారాయణరావు కృషి మూలంగా ఖమ్మంలో విజ్ఞాన నికేతన గ్రంథాలయం స్థాపించారు.
- విజ్ఞాన చంద్రిక గ్రంథాలయ సంస్థ హైదరాబాద్లోని రెసిడెన్సీ బజారులో రావిచెట్టు రంగారావు ఇంట్లో ఉండేది.
- నిజాం పోలీసుల నిఘా కారణంగా విజ్ఞాన చంద్రిక గ్రంథాలయాల సంస్థ కార్యాలయాన్ని మద్రాస్కు తరలించారు.
- అణాకు ఒక పుస్తకాన్ని అమ్మిన వారు కేసీ గుప్తా. ఈ సంస్థ ప్రచురించిన తొలి పుస్తకం హైదరాబాద్ రాజ్యాంగ సంస్కరణలు.
- నిజాం తీసుకువచ్చిన సంస్కరణలను ఉర్దూ నుంచి తెలుగులోకి వెల్దుర్తి మాణిక్యరావు అనువదించారు.
- రైతు అనే పుస్తకాన్ని వెల్దుర్తి మాణిక్యరావు ముద్రించారు. ఈ పుస్తకాన్ని నిజాం ప్రభుత్వం నిషేధించింది.
- నెమిలికొండలోని విజ్ఞాన ప్రచారిణి గ్రంథాలయం రచయితలతో గ్రామ వ్యవసాయం, వైద్యం, పరిశ్రమలు, చారిత్రక విషయాలపై నాలుగు గ్రంథాలను ప్రచురించింది.
- 1932లో ఏర్పడిన హైదరాబాద్ సాహిత్య పరిషత్కు అధ్యక్ష, కార్యదర్శులుగా ఆచార్య రాయప్రోలు సుబ్బారావు, ఆచార్య కురుగంటి సీతారామం వ్యవహరించారు.
- బూర్గుల రంగనాథరావు, నెల్లూరు కేశవస్వామి, వెల్దుర్తి మాణిక్యరావుల కృషితో 1939లో సాధన సమితి ఏర్పడింది.
- వట్టికోట ఆళ్వారుస్వామి 1941లో స్థాపించిన దేశోద్ధారక గ్రంథమాల తరఫున 30 పుస్తకాలను ప్రచురించారు.
- గ్రంథాలయ నిర్వాహకులు పరస్పర సానుభూతి సహకారాలు తెల్పుకోవడం కోసం 1925లో ఖమ్మం జిల్లా మధిరలో గ్రంథాలయ మహాసభ నిర్వహించారు.
- మధిరలో జరిగిన మొదటి గ్రంథాలయ మహాసభకు ప్రముఖ న్యాయవాది పింగళి వెంకటరామారెడ్డి అధ్యక్షత వహించారు.
- రెండో గ్రంథాలయ మహాసభ వామన్ నాయక్ అధ్యక్షతన 1929 మే 31, జూన్ 1వ తేదీల్లో సూర్యాపేటలో జరిగింది.
- నిజామాంధ్రోద్యమం తెలంగాణవ్యాప్తంగా వ్యాపించడానికి గ్రంథాలయాలు ప్రధాన కారణమయ్యాయి.