కొల్లాపూర్, వెలుగు: వార్త సేకరణ కోసం వెళ్లిన విలేకర్లపై దాడి చేసిన అలివి వలల మాఫియాపై చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర హౌసింగ్ కమిటీ మెంబర్ రామ్ రెడ్డి, తాలూకా అధ్యక్షుడు రాజేందర్ డిమాండ్ చేశారు. దాడిని ఖండిస్తూ మంగళవారం కొల్లాపూర్ సీఐ కి ఫిర్యాదు చేశారు.
నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం లో వార్త సేకరణకు వెళ్లిన జర్నలిస్టుల అలివి వలల మాఫియా దాడి చేసిందని , రాత్రి వేళలో దిక్కుతోచని స్థితిలో జర్నలిస్టులు తమ రక్షణ కోసం డయల్ 100 కు ఫోన్ చేసినా.. స్థానిక పోలీసులు స్పందించకపోవడం దారుణం అన్నారు. ఇలాంటి దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బొల్గం వెంకటస్వామి, ఉపాధ్యక్షుడు సురేశ్, జర్నలిస్టులు వినోద్, కేశవ్, రాజశేఖర్, రమణ పాల్గొన్నారు.