
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రవీణ్ మెమోరియల్ ఆర్జేఎం కప్రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు గురువారం కొత్తగూడెంలోని సాధన గ్రౌండ్లో మొదలయ్యాయి. పోటీలను రాజేందర్ సేవా సంస్థ అధ్యక్షులు యెర్రా కామేశ్, సీనియర్ అడ్వకేట్ జీవీ మనోహర్ ప్రారంభించారు. క్రీడలతో స్నేహభావం పెరుగుతుందని వారన్నారు. ఈ ప్రోగ్రాంలో సాయి, శరత్, శివ, జేమ్స్, సర్వేశ్ పాల్గొన్నారు.