- స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ డిమాండ్
హైదరాబాద్, వెలుగు : కొత్తగా నిర్మించనున్న రామగుండం థర్మల్ప్లాంట్ను జెన్కోకే కేటాయించాలని స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. ఇంధన శాఖ కార్యదర్శి, ట్రాన్స్కో, జెన్ కో సీఎండీ రొనాల్డ్ రాస్కు జేఏసీ ఆధ్వర్యంలో పవర్ ఇంజనీర్ల ప్రతినిధులుఈ మేరకు వినతిపత్రం అందించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జెన్కోకు చెందిన రామగుండం బీ థర్మల్ పవర్ స్టేషన్ ను మూసేసిందని
అదే 580 ఎకరాల ప్లేస్ ను సింగరేణికి అప్పగించి థర్మల్ ప్లాంట్ను నిర్మించాలని యోచిస్తోందని తెలిపారు. దీంతో విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న వేల మంది ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పారు. కొత్త ప్రభుత్వం నిర్మించబోయే కొత్త ప్రాజెక్టులన్నింటినీ జెన్ కో ద్వారానే నిర్మించాలని డిమాండ్ చేశారు.