
- రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్
మమబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో యువత ఎక్కువ శాతం చనిపోతున్నారని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్, సహకార శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి జానకితో కలిసి పోలీస్, రవాణా, జాతీయ రహదారులు, వైద్యారోగ్య శాఖ, ఆర్అండ్ బీ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 19 నుంచి 35 ఏండ్ల వారు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని చెప్పారు.
విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించాలన్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో రోడ్డు సేఫ్టీ కమిటీలు, వాలంటీర్లను నియమించాలని కోరారు. జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్ర శేఖర్ గౌడ్, అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు, ఆర్అండ్ బీ ఈఈ దేశ్యా నాయక్, డీటీసీ కిషన్ పాల్గొన్నారు.