ఆదివాసులు ఐక్యంగా ఉద్యమించాలి .. కుమ్రం భీం విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యేలు

ఆదివాసులు ఐక్యంగా ఉద్యమించాలి .. కుమ్రం భీం విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యేలు

బెల్లంపల్లి రూరల్, వెలుగు: నీతి, నిజాయితీతో ఉద్యమిస్తే హక్కులు సాధించుకోగలమని ఆసిఫాబాద్, ఖానాపూర్​ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు పటేల్​అన్నారు. కాసిపేట మండలంలోని దేవాపూర్​లో ఏర్పాటు చేసిన ఆదివాసీ వీరుడు కుమ్రం భీం విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ఆదివాసులు ఐక్యంగా ఉద్యమించి హక్కులు సాధించుకోవాలన్నారు. ఆదివాసుల ఉద్యమాలను కొందరు తాకట్టుపెట్టి ప్రయోజనం పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ఆదివాసీలకు ఓరియంట్​ సిమెంట్​ కంపెనీతోనే కాకుండా అనేక రకాలుగా అన్యాయం జరుగుతోందన్నారు.

 రాజకీయాలకు అతీతంగా జాతి మనుగడ, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఏకతాటిపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు చిన్నయ్య, ఆత్రం సక్కు, తుడుందెబ్బ  రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కుమార్,  ఆదివాసీ మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ, కుమ్రం భీం మనుమడు కుమ్రం సోనేరావు, ఎంపీపీ రొడ్డ లక్ష్మి, కాంగ్రెస్, బీఆర్​ఎస్​ పార్టీల​ మండల అధ్యక్షులు కృష్ణ, రమణరెడ్డి, ఆదివాసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.