స్టాక్ మార్కెట్లకు ఏమైంది?

స్టాక్ మార్కెట్లకు ఏమైంది?

ఇటీవల భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలకు..అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు ప్రధాన కారణాల్లో ఒకటిగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..  స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% సుంకాలు విధించారని ప్రకటించడంతో  మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది.  చైనా సహా ఇతర దేశాలు కూడా తమ టారిఫ్​ నిర్ణయాలను  ప్రకటించడంతో,  భారతీయ స్టీల్ కంపెనీలకు 

గట్టి దెబ్బ తగిలింది.  డాలరుతో పోలిస్తే  భారత రూపాయి 87.92 స్థాయికి చేరి ఆల్-టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది.  డాలర్  బలపడటంతో  విదేశీ పెట్టుబడిదారులు  తమ పెట్టుబడులను ఉపసంహరించు
కోవడం ప్రారంభించారు.

మార్కెట్​పై ఆర్బీఐ చర్యల  ప్రభావం

రిజర్వ్  బ్యాంక్  ఆఫ్  ఇండియా (ఆర్బీఐ) చేపట్టిన  తాజా చర్యలు కూడా  మార్కెట్‌‌‌‌‌‌‌‌ను  ప్రభావితం చేశాయి.  ఆర్బీఐ ఇటీవల 
రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించినప్పటికీ, మార్కెట్‌‌‌‌‌‌‌‌లో  తగినంత లిక్విడిటీ అందించలేకపోయింది. మరోవైపు, 
10- ఇయర్ ప్రభుత్వ బాండ్ యీల్డ్ 6.83% స్థాయికి పెరగడం, పెట్టుబడిదారులు స్టాక్స్‌‌‌‌‌‌‌‌కు బదులుగా సేఫ్ బాండ్‌‌‌‌‌‌‌‌లను ఎంచుకునేలా చేసింది.  

బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలు ఈ మార్కెట్ పతనంలో ప్రధాన బాధితులుగా మారాయి. PSU బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మార్కెట్ పుంజుకోవాలంటే, విదేశీ పెట్టుబడిదారుల  మళ్లీ  ప్రవేశం,  రిజర్వు బ్యాంక్​ మరింత సహాయక చర్యలు తీసుకోవడం, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం అవసరం. అమెరికా దుందుడుకు వాణిజ్య విధానాలు,  మరోవైపు రూపాయి బలహీనత, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు, స్టీల్ అండ్​ బ్యాంకింగ్ రంగాల నష్టాలు అని చెప్పొచ్చు.  భవిష్యత్తులో  మార్కెట్ ఎలా ప్రవర్తిస్తుందనేది ప్రధానంగా  డాలర్ మారకపు విలువ, కేంద్ర బ్యాంక్ విధానాలు,  అంతర్జాతీయ వాణిజ్య పరిణామాలపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.

- శ్రీనివాస్ గౌడ్ ముద్దం-