
ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. 20 కోట్ల మంది భారతీయులు స్టాక్ మార్కెట్లపై ఇన్వెస్ట్ చేశారన్న ఆయన... స్కాక్ మార్కెట్ల స్కాంపై జేపీసీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. జూన్ 3న స్టాక్ మార్కెట్లు స్టాక్ మార్కెట్లు పెరుగుతాయని హోంమంత్రి చెప్పారని.. ఈవి షయం ఆయనకు ఎలా తెలుసని ప్రశ్నించారు. ఇది స్టాక్ మార్కెట్లో అత్యంత పెద్ద స్కాం అన్నారు. స్టాక్ మార్కెట్ల విషయంపై మొదటిసారిగా ప్రధాని మోదీ మాట్లాడారన్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా తమ విధులను దుర్వినియోగం చేశారన్నారు. జూన్ 3 పెరిగిన స్టాక్ మార్కెట్లు.. జూన్ 4న పడిపోయాయన్నారు. ఎన్నికల అనంతరం మీడియా తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే విషయంలో మోదీ ప్రమేయం ఉందని రాహుల్ గాంధీ అన్నారు.
ఫారెన్ ఇన్వెస్టర్లకు .. ఎగ్జిట్ పోల్స్కు ఏమైనా సంబంధం ఉందా.. ఎగ్జిట్ పోల్స్ చేసిన వారికి బీజేపీతో సంబంధం ఉందా.. స్కాక్ మార్కెట్ల పడిపోవడంతో ఇన్వెస్టర్లు 30 లక్షల కోట్లు నష్టపోయారన్నారు. బీజేపీ ఇంటర్నల్ సర్వేలో 220 సీట్లు వస్తాయని ముందే వారికి తెలుసన్నారు. ఎన్నికల తరువాత షేర్లు పెరుగుతాయని ప్రధానిమోదీ, హోం మంత్రి అమిత్ షా పదే పదే ఎందుకు చెప్పాల్సి వచ్చిందని ప్రశ్నించారు.