
భద్రాచలం, వెలుగు: ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో తెలంగాణకు చెందిన క్రీడాకారుడు గోల్డ్ మెడల్ సాధించాడు. యూరప్ఖండ దేశమైన మాల్టాలో బుధవారం జరిగిన పోటీల్లో జూనియర్స్ విభాగంలో బెంచ్ప్రెస్140 కిలోలు, స్క్వాట్స్ 280 కిలోలు, డెడ్లిఫ్ట్ 242.5 కిలోలు, టోటల్గా662.5 కిలోల బరువులు ఎత్తి భద్రాచలంలోని సిటీ స్టైల్జిమ్కు చెందిన మోడెం వంశీ బంగారు పతకం గెలిచాడు. ఇతను ములుగు జిల్లా వాజేడు మండలం ఇప్పగూడెంలోని దినసరి కూలీ కుటుంబానికి చెందిన గిరిజన బిడ్డ.
జాతీయ స్థాయిలో వంశీ పలు పతకాలు సాధించి ఇంటర్నేషనల్పోటీలకు ఎంపికవగా.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండగా.. భద్రాచలానికి చెందిన ప్రముఖులు సాయమందించారు. అంతర్జాతీయ పవర్లిఫ్టింగ్పోటీల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు రూ.2.10 లక్షలను పవర్లిఫ్టింగ్ఆఫ్ ఇండియాకు చెల్లించాలి. ఇలా చెల్లించిన వంశీ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకం సాధించడంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తంచేశారు.