బోథ్​ మండలంలో  అక్రమంగా బెల్టు షాప్​లు నిర్వహిస్తే కఠిన చర్యలు : ఎస్సై ఎల్.ప్రవీణ్​కుమార్

బోథ్​ మండలంలో  అక్రమంగా బెల్టు షాప్​లు నిర్వహిస్తే కఠిన చర్యలు : ఎస్సై ఎల్.ప్రవీణ్​కుమార్
  • ధన్నూర్​బి, కౌఠ బిలో రూ.2.24 లక్షల మద్యం స్వాధీనం

బోథ్, వెలుగు: బోథ్​ మండలంలో అక్రమంగా బెల్టు షాప్​లు నిర్వహిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఎల్.ప్రవీణ్​కుమార్ ​హెచ్చరించారు. ఎస్పీ అఖిల్​మహాజన్ ​ఆదేశాల మేరకు గురువారం కౌఠ బి, ధన్నూర్ బి గ్రామాల్లోని బెల్ట్​ షాపులపై దాడులు నిర్వహించినట్లు చెప్పారు. కౌఠ బిలో బెల్టుషాప్ లో రూ.90 వేల మద్యం స్వాధీనం చేసుకొని నిర్వాహకుడు శ్రీనివాస్ ​గౌడ్​పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ధన్నూర్​'బి'లో బెల్టుషాప్​లో రూ.1.34 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకొని నిర్వాహకుడు రత్నపురం సాయన్నపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీరితో పాటు ఈ రెండు గ్రామాల వీడీసీలకు చెందిన పలువురిపై, అందులో పనిచేసే వారిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. వీడీసీల పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.