
జోగిపేట, వెలుగు: కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జోగిపేట డివిజన్ టాస్క్ఫోర్స్అధికారులు విత్తన షాపుల యజమానులను హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని పలు విత్తన షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. సీడ్ ప్యాకెట్లపై ఉన్న డేట్, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు తప్పకుండా రశీదు ఇవ్వాలని సూచించారు. తనిఖీల్లో ఆర్డీవో పాండు, వ్యవసాశాఖ ఏడీ అరుణ, తహసీల్దార్ భాస్కర్, ఎస్ఐ అరుణ్కుమార్ పాల్గొన్నారు.