
ఆదిలాబాద్ టౌన్, వెలుగు : ఆదిలాబాద్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గణేశ్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
బోథ్ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వన్నెల అశోక్ను తొలగించి ఆడె గజేందర్కు టికెట్ ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ఆదివాసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ను ఖతం చేయడానికి రేవంత్ పూనుకున్నాడని విమర్శించారు.