
హైదరాబాద్, వెలుగు: చిన్న నగరాల విద్యార్థుల కెరీర్ డెవెలప్మెంట్ కోసం పనిచేసే డిజిటల్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్ ‘స్టూడెంట్ ట్రైబ్’తో డ్రోన్ సంస్థ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. విద్యార్థులకు డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన కీలక విషయాలు నేర్పించడం దీని లక్ష్యం. ప్రతి నెలలో జరిగే ఈవెంట్స్ , ఆన్లైన్ వేదికలు, క్యాంపస్ అంబాసిడర్ల నెట్వర్క్ ద్వారా విద్యార్థులు సంప్రదాయ పాఠాల కంటే ఎక్కువగా నేర్చుకుంటారని మారుత్ డ్రోన్స్ తెలిపింది. అంతేగాక ఐదు రోజుల డ్రోన్ పైలెట్ ట్రైనింగ్ వర్క్ షాప్ను నిర్వహించి డ్రోన్లకు డీజీసీఏ నియమాలు, ఫ్లైట్ సిమ్యులేటర్ శిక్షణ, సోలో ఫీల్డ్ ఫ్లయింగ్ పరీక్షల గురించి అవగాహన కల్పిస్తామని మారుత్ పేర్కొంది.