పుట్టెడు బాధలోనూ ఎగ్జామ్​ రాసిన స్టూడెంట్

పుట్టెడు బాధలోనూ ఎగ్జామ్​ రాసిన స్టూడెంట్

దహెగాం, వెలుగు: తండ్రి చనిపోయిన బాధను దిగమింగి ఓ విద్యార్థిని పదో తరగతి పరీక్ష రాసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్  జిల్లా దహెగాం మండలం మండలంలోని చౌక గ్రామానికి చెందిన మేకల రాజన్న అనారోగ్యంతో మంగళవారం రాత్రి చనిపోయాడు. రాజన్న కూతురు అనురాధ దహెగాం కేజీబీవీలో టెన్త్​ చదువుతోంది. 

తండ్రి చనిపోయిన విషయం తెలిసినా బాధను దిగమింగి బుధవారం మ్యాథ్స్​ ఎగ్జామ్​ రాసింది. అనంతరం గ్రామంలో జరిగిన తండ్రి అంత్యక్రియలకు హాజరైంది.