కోర్సులు పూర్తయినా స్టడీ సర్టిఫికెట్లు ఇవ్వట్లే.. కూకట్ పల్లి పీఎస్​ ఎదుట స్టూడెంట్ల ధర్నా

కోర్సులు పూర్తయినా స్టడీ సర్టిఫికెట్లు ఇవ్వట్లే..  కూకట్ పల్లి పీఎస్​ ఎదుట స్టూడెంట్ల ధర్నా

కూకట్​పల్లి, వెలుగు: కోర్సు పూర్తయినా కూకట్​పల్లిలోని అమృత ఇన్​స్టిట్యూట్ ఆఫ్​మేనేజ్​మెంట్​అండ్ మెడికల్​సైన్స్(ఎయిమ్స్) కాలేజీ యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని స్టూడెంట్లు వాపోయారు. సోమవారం మధ్యాహ్నం కూకట్​పల్లి పోలీసుస్టేషన్ కు చేరుకుని ఆందోళనకు దిగారు. తామంతా అమృత ఇనిస్టిట్యూట్​లో సైన్స్​ ఒకేషనల్, పారా మెడికల్​కోర్సులు​ పూర్తి చేసినప్పటికీ యాజమన్యం సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని చెప్పారు. కూకట్​పల్లి సప్తగిరి కాంప్లెక్స్​రెండో ఫ్లోర్​లో అమృత ఇనిస్టిట్యూట్ కొనసాగుతుందన్నారు. వీరికి పంజాగుట్ట, మెహిదీపట్నంలోనూ బ్రాంచులు ఉన్నాయని, కూకట్​పల్లి బ్రాంచ్​లో దాదాపు 300 మంది చదువుకుంటున్నారని చెప్పారు. 

ఒక్కో విద్యార్థి నుంచి రూ. 50 వేలు ఫీజులు వసూలు చేశారన్నారు. అంతకు ముందు యాజమాన్యాన్ని లోపల ఉంచి బయట షట్టర్లకు స్టూడెంట్లు తాళాలు వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని స్టూడెంట్లను స్టేషన్​కు తరలించారు. దీంతో పోలీసుస్టేషన్​ఎదుట ఆందోళనకు దిగారు. యాజమాన్యంపై కేసు నమోదు చేసి తమకు సర్టిఫికెట్లు ఇప్పించాలని డిమాండ్​ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పంజాగుట్ట పీఎస్​లోనూ అమృత స్టూడెంట్లు ఆందోళనకు దిగారు.