
- ఫస్ట్ ఇయర్లో మేడ్చల్టాప్, సెకండ్ఇయర్లో థర్డ్ప్లేస్
- రంగారెడ్డికి రెండు, నాలుగు స్థానాలు
- వెనకబడ్డ హైదరాబాద్, వికారాబాద్
- గత ఏడాదితో పోలిస్తే కాస్త బెటరే
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇంటర్ఫలితాల్లో మేడ్చల్– మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచారు.హైదరాబాద్స్టూడెంట్లుఫస్ట్ఇయర్లో ఫర్వాలేదనిపించినా, సెకండియర్లో వెనకబడ్డారు. వికారాబాద్జిల్లాదీ ఇదే పరిస్థితి. మొత్తంగా చూస్తే అమ్మాయిలు అదరగొట్టారు. మేడ్చల్– మల్కాజిగిరిజిల్లాలోని ఫస్ట్ఇయర్స్టూడెంట్లు జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో కలిపి 77.21 శాతం మంది, సెకండ్ఇయర్స్టూడెంట్లు 77.91 శాతం మంది పాస్అయ్యారు.
ఫస్ట్ఇయర్ఫలితాల్లో మేడ్చల్ జిల్లా స్టేట్నంబర్వన్స్థానంలో నిలిచింది. సెకండ్ఇయర్లో మూడో స్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లా 76.36 శాతంతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలవగా, రెండో సంవత్సరంలో 77.63 శాతంతో స్టేట్లో ఫోర్త్ప్లేస్సాధించింది. హైదరాబాద్ జిల్లా మొదటి సంవత్సరంలో 66.68 శాతంతో ఏడో స్థానంలో నిలవగా, సెకండ్ఇయర్లో 67.74 శాతంతో 23వ స్థానంలో నిలిచింది. వికారాబాద్జిల్లా ఫస్ట్ఇయర్లో 61.31 శాతంతో 12వ స్థానంలో నిలవగా, సెకండ్ఇయర్లో 68.20 శాతంతో 21 స్థానంతో సరిపెట్టుకుంది.
హాజరైంది ఎంత.. పాసయ్యింది ఎంత?
మేడ్చల్జిల్లాలో 68,650 మంది ఫస్ట్ఇయర్పరీక్షలు రాయగా, 53,003 మంది విద్యార్థులు పాస్అయ్యారు. 62,539 మంది సెకండ్ఇయర్పరీక్షలు రాయగా, 48,726 మంది ఉత్తీర్ణత సాధించారు. రంగారెడ్డి జిల్లాలో 80, 412 మంది ఫస్ట్ఇయర్ఎగ్జామ్స్రాయగా, 61,406 మంది, సెకండ్ఇయర్లో 70, 581 మందికి గానూ 54,721 మంది పాసయ్యారు. హైదరాబాద్లో 85,772 విద్యార్థులు ఫస్ట్ఇయర్పరీక్షలు రాయగా 57,197 మంది, సెకండ్ఇయర్లో 74,781 మంది ఎగ్జామ్స్రాయగా 50,659 మంది పాస్అయ్యారు. వికారాబాద్జిల్లాలో 7,914 మంది ఫస్ట్ఇయర్పరీక్షలు రాయగా 4,852 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్లో 6,789 మందికి గానూ 4,630 మంది పాసయ్యారు.
కిందటేడుతో పోలిస్తే బెటర్
కిందటి ఏడాదితో పోలిస్తే మొదటి సంవత్సర ఫలితాల్లో మేడ్చల్జిల్లా మెరుగు పడింది. గతేడాది 71శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, ఈసారి పాస్పర్సంటేజ్77.21 శాతంగా నమోదైంది. సెకండ్ఇయర్లో గతేడాది 79 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈసారి రెండు శాతం తగ్గింది. రంగారెడ్డి జిల్లా గతేడాది ఫస్ట్ఇయర్లో 71శాతం తెచ్చుకోగా, ఈసారి ఐదు శాతం పెంచుకుని 76 శాతానికి చేరింది.
రెండో సంవత్సరంలో కిందటేడు 77 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది కూడా అంతే ఉంది. హైదరాబాద్ జిల్లా ఫస్ట్ఇయర్లో 59 శాతం నుంచి 66 శాతానికి పెరిగింది. సెకండ్ఇయర్లో గత ఏడాది 65 శాతం సాధించగా, ఈసారి 67.74 శాతంకు పెరిగింది. వికారాబాద్జిల్లా ఫస్ట్ఇయర్లో గతేడాది 53 శాతం సాధించగా, ఈసారి 61 శాతం సాధించింది. సెకండ్ఇయర్లో గత ఏడాది 61 శాతం మంది పాస్అవ్వగా, ఈసారి 68.20 శాతం మంది పాస్అయ్యారు.
సర్కారు కాలేజీల స్టూడెంట్ల సత్తా
పద్మారావునగర్/శంషాబాద్: ఇంటర్ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో మహేంద్ర హిల్స్ గురుకులం స్టూడెంట్లు సత్తా చాటారు. ఫస్ట్ఇయర్ లో 76 మంది పరీక్షలు రాయగా, 74 మంది పాస్అయ్యారు. ఎంపీసీ స్టూడెంట్లు కె.శృతి 467, బి.శ్రీచన, డి.పూర్ణిమ 466 మార్కులతో మెరిశారు. బైపీసీ స్టూడెంట్లు ఎం.సంప్రీతి 437 సత్తా చాటింది. సెకండ్ఇయర్లో 77 మంది పరీక్షలు రాయగా, 76 మంది పాస్ అయ్యారు.
ఎంపీసీలో డి.మమత 992, టి.మౌనిక 991 మార్కులతో, బైపీసీలో బి.ప్రవళిక 991, జి.స్నేహ 989 మార్కులతో టాపర్లుగా నిలిచారు. పాలమాకుల తెలంగాణ మోడల్ కాలేజీ స్టూడెంట్లు సత్తాచాటారు. సెకండ్ఇయర్స్టూడెంట్లు శరణ్య 979, జెన్నిఫర్ 986, శృతి సాహు 941 మార్కులతో, ఫస్ట్ఇయర్లో సిరిచందన 455, ఈషా 423, టి.కావ్య 462 మార్కులతో ప్రతిభ కనబరిచారు.
జిల్లాల వారీగా పాస్పర్సంటేజ్
జిల్లా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్
మేడ్చల్ 77.21 77.91
రంగారెడ్డి 76.36 77.63
హైదరాబాద్ 66.68 67.74
వికారాబాద్ 61.31 68.20