
హన్వాడ, వెలుగు : ఆ ఊళ్లో ఏ కారణం లేకుండా స్కూల్కు డుమ్మా కొట్టి ఇంటికాడ ఉందామంటే కుదరదు. బడి ఎగ్గొడదామని ఫిక్సయితే ఇంటి ముందు బ్యాండ్సప్పుడు వినడానికి సిద్ధంగా ఉండాలె. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్దదర్పల్లిలోని ప్రైమరీ స్కూల్ లో 82 మంది స్టూడెంట్స్చదువుతున్నారు. కొందరు విద్యార్థులు ఏ కారణం లేకుండా స్కూల్ కు డుమ్మా కొడుతున్నారు. పొలం పనులకు వెళ్లే తల్లిదండ్రులకు ఈ విషయం తెలియడం లేదు. దీంతో స్కూల్ టీచర్ అర్జున్, రిటైర్డ్ఆర్మీ ఉద్యోగి రఘురాంగౌడ్ ఒక ఉపాయం చేశారు. స్కూల్పిల్లలతో ఒక బ్యాండ్ఏర్పాటు చేయించి బడికి రాని విద్యార్థుల ఇండ్లకు వెళ్లి బజాయిస్తున్నారు. ఇది మంచి ఫలితాన్నిచ్చింది. స్కూల్ఎగ్గొట్టే వారి సంఖ్య కూడా తగ్గింది. బుధవారం కూడా ఇలాగే స్కూల్కు రాని స్టూడెంట్ఇంటికి వెళ్లి బ్యాండ్మోగించారు. దీంతో సదరు విద్యార్థి వెంటనే బ్యాగ్సర్ధుకుని బడి బాట పట్టాడు. దీంతో మంచి ఐడియాతో పిల్లలు బడి మానకుండా చేస్తున్నారని టీచర్అర్జున్, రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయ్రఘురాంను గ్రామస్తులు అభినందిస్తున్నారు.