క్వాలిటీ ఫుడ్​ పెట్టడం లేదని విద్యార్థులు ధర్నా

క్వాలిటీ ఫుడ్​ పెట్టడం లేదని విద్యార్థులు ధర్నా

కోస్గి, వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని మండలంలోని చెన్నారం ప్రైమరీ స్కూల్​ ఎదుట విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బుధవారం ఆందోళన చేశారు. స్కూల్​లో 40 మంది విద్యార్థులు ఉండగా, మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టకపోవడంతో పలుమార్లు పేరెంట్స్​ స్కూల్​కు వెళ్లి సమస్యను వివరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్న భోజనం పెట్టకపోవడంతో పేరెంట్స్​ బుధవారం స్కూల్​ ముందు రోడ్డుపై ఆందోళనకు దిగారు.

 హెచ్ఎం, వంట నిర్వాహకులను మార్చాలని డిమాండ్​ చేశారు. విషయం తెలుసుకున్న ఎంఈవో శంకర్ నాయక్  సముదాయించే ప్రయత్నం చేయగా, పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఉందని ఎంఈవోను నిలదీశారు. అనంతరం హెచ్ఎం, వంట నిర్వాహకులను మార్చాలని పేరెంట్స్​ ఫిర్యాదు చేశారు.