
ఆదిలాబాద్ వెలుగు ఫొటోగ్రాఫర్ : ఇంటర్ పరీక్షలు గురువారం ముగిసిపోవడంతో విద్యార్థులు ఇంటి బాట పట్టారు. పరీక్షలు ముగియగానే స్నేహితులతో సరదాగా మాట్లాడి టాటా బైబైలు చెప్పుకున్నారు. అనంతరం సంక్షేమ హాస్టల్స్, కాలేజీల నుంచి తమ లగేజీ సర్దుకొని ఇంటి బాటపట్టారు.
సొంత గ్రామాలకు బయలుదేరిన స్టూడెంట్స్, వారిని తీసుకెళ్లడానికి వచ్చిన పేరెంట్స్తో ఆదిలాబాద్ బస్టాండ్ పరిసరాలు కిటకిటలాడాయి.