టీచర్ల కోసం స్టూడెంట్ల ధర్నా

టీచర్ల కోసం స్టూడెంట్ల ధర్నా

పాలేరు హైస్కూల్ కు టీచర్స్ కావాలని విద్యార్థులు ఖమ్మం- సూర్యాపేట రాష్ట్ర రహదారి పైన రాస్తారోకో , స్కూల్​ గేట్​ ఎదురుగా ధర్నా చేశారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు ఉన్న ఈ స్కూళ్లో 225 మంది విద్యార్థులున్నారు. కేవలం ఐదుగురు టీచర్లే ఉండటంతో ఇబ్బందులు వస్తున్నాయి. మరో ఐదుగురు టీచర్లను కేటాయించాలని స్టూడెంట్లు ధర్నా చేశారు. డీఈఓ సోమశేఖర్ శర్మ, ఎంఈఓ రామాచారి స్పందించి.. విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు, రేపటికల్లా ఐదుగురు టీచర్లను కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. కారేపల్లి మండలంలోని జైత్రాంతండా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆందోళన చేశారు. 70మంది విద్యార్థులకు ఒకే ఒక్క టీచర్ ఉన్నారని, వెంటనే టీచర్ల ను ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్​ చేశారు. - కూసుమంచి/కారేపల్లి, వెలుగు